బంజారాహిల్స్,మే 26: అర్ధరాత్రి వేళ పనిముగించుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తిని అటకాయించి డబ్బులు (Money) ఇవ్వాలంటూ బెదిరించడంతో పాటు దాడికి(Attack) పాల్పడిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 5లోని(Banjarahills) దేవరకొండబస్తీకి చెందిన ఏ.నవీన్(24) అనే అటో డ్రైవర్(Auto driver) ఈనెల 24న అర్ధరాత్రి దాటిన తర్వాత పని ముగించుకుని ఇంటికి వస్తున్నాడు.
బస్తీకి చేరుకోగానే స్థానికంగా నివాసం ఉంటున్న సాగర్ అలియాస్ పప్పీ అనే వ్యక్తి ఆటోను అడ్డగించాడు. డబ్బులు ఇవ్వాలంటూ నవీన్ను డిమాండ్ చేయగా తనవద్ద లేవని సమాధానం ఇచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన సాగర్ చేతికి ఉన్న ఐరన్ కడియంతో నవీన్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో తలకు, ముఖానికి బలమైన గాయాలు అయ్యాయి. ఈ మేరకు బాధితుడి సోదరుడు విశ్వనాథ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐపీసీ 394 సెక్షన్ కింద సాగర్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.