హయత్నగర్, మార్చి 17 : గోవులను తరలిస్తున్న ఓ లారీ బోల్తా పడిన సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆవులను తరలిస్తున్న లారీ పెద్ద అంబర్పేట వైపు నుంచి హైదరాబాద్కు వస్తుండగా మార్గ మధ్యలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో లారీలో ఉన్న 2 ఎద్దులు, ఒక అవు గాయ పడ్డాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన పశువులను అబ్దుల్లాపూర్ మెట్ గోశాలకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.