కొండాపూర్, ఫిబ్రవరి 4 : ఒడిషా నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 39 కేజీల గంజాయిని చందానగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్ర కొల్లాపూర్కు చెందిన శివ, రాహుల్ శరత్ సొంతూరులో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకం చేస్తున్నారు. ఈజీ మనీ కోసం గంజాయి అమ్మాలని ప్లాన్ వేసుకుని, ఈ క్రమంలో భువనేశ్వర్ వెళ్లి 39 కేజీల గంజాయి కొనుగోలు చేసారు.
హైదరాబాద్లో అమ్మేందుకు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కి ట్రైన్ లో బయలుదేరారు. సమాచారం అందుకున్న శేరిలింగంపల్లి ఎస్ఓటి పోలీసులు లింగంపల్లి రైల్వే స్టేషనులో కాపుకాసి శివ, రాహుల్ లను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 39 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.19.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.