హైదరాబాద్ : ఆగిఉన్న ఆర్టీసీ బస్సు(Rtc Bus)లో ఒక్కసారిగా మంటలు(Fire broke) చెలరేగాయి. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి షాపూర్ వాటర్ ట్యాంక్(Shahpur water tank) సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్రిమాపక సిబ్బంది(Fire fighters) సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు సమాచారం. ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు బస్సులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.