హైదరాబాద్ : నగరంలోని అసెంబ్లీ ఎదురుగా శనివారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు ప్రమాదస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మురళీకృష్ణగా పోలీసులు గుర్తించారు. మురళీకృష్ణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.