Dog Attack | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరోసారి వీధి కుక్కలు రెచ్చిపోయాయి. దిల్సుఖ్నగర్లోని శాంతి నగర్లో గురువారం రాత్రి ఓ ముగ్గురు చిన్నారులు తమ ఇంటి ముందు ఆడుకునేందుకు బయటకు వచ్చారు. రోడ్డుపై ఓ రెండు కుక్కలు అరుస్తూ దూసుకురావడాన్ని చిన్నారులు గమనించారు. దీంతో క్షణం ఆలస్యం చేయకుండా పిల్లలు ముగ్గురు గేటు లోపలికి పరుగెత్తారు.
అయినప్పటికీ ఓ కుక్క వెంబడించి, ముగ్గురిలో ఒకరిపై దాడి చేసింది. ఆ అపార్ట్మెంట్ గేటుకు కొంచెం దూరంలో ఉన్న ఓ వ్యక్తి అప్రమత్తమై కుక్కను తరిమాడు. కుక్క దాడిలో బిట్టు అనే ఐదేండ్ల బాలుడి తొడకు గాయమైంది. అనంతరం బాబును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీధి కుక్కల బెడద నుంచి కాలనీ వాసులను రక్షించాలని స్థానికులు అధికారులకు మొర పెట్టుకున్నారు.