హైదరాబాద్ : నగరంలోని హుస్సేన్ సాగర్లో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు రాంగోపాల్ పేట్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సాగర తీరానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడిని కాచిగూడకు చెందిన హసిక్గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలతోనే హసిక్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.