హైదరాబాద్ : బైక్ను కారు ఢీకొన్న సంఘటనలో(Road accident) ఓ కానిస్టుబుల్(Constable Died) మృతి చెందాడు. భార్య, పిల్లలు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సూరూర్నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ధనుంజయ భార్య, పిల్లలతో కలిసి బైక్పై వెళ్తున్నాడు.
పోచారంలో ఎదురుగా వస్తున్న కారు ఢీ కొనడంతో ధనుంజయ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి బార్య, పిల్లలు గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను దవాఖానకు తలరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.