Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్లోని జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. శనివారం రాత్రి చెన్నాపురం చెరువు వద్ద వేణు(41) అనే వ్యక్తి గొంతుకోసి హత్య చేశారు.
రక్తపు మడుగులో పడి ఉన్న వేణును స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి, ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వేణును హత్య చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పాత కక్షల కారణంగానే వేణును మర్డర్ చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్బాడీని గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.