సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలో సర్కిల్ కార్యాలయాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 82 దరఖాస్తులను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. చార్మినార్ జోన్ నుంచి 3, సికింద్రాబాద్ 10, కూకట్పల్లిలో 29, శేరిలింగంపల్లిలో 29 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను వారంలోగా పరిష్కరిస్తామన్నారు.