ఆర్టీసీలో వందరోజుల ప్రణాళిక
సెలవులు తీసుకోని వారికి ప్రతినెలా రూ.500 పారితోషికం
35 ప్రాంతాల్లో ఆర్టీసీ సెక్యూరిటీ కానిస్టేబుళ్లు
రోజుకు రూ.4 కోట్ల రాబడి టార్గెట్
కొత్త కాలనీలకు కూడా బస్లు ఆర్టీసీ జీహెచ్ఎంసీ
సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : నగరంలో సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీని పెంచేందుకు కసరత్తు మొదలైంది. వంద రోజుల ప్రణాళికతో ఆర్టీసీ జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ఈనెల 16 నుంచి ప్రారంభమైన వందరోజుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా 65 శాతం ఉన్న ఆక్యుపెన్సీని 80 శాతానికి పెంచడంపై దృష్టి సారించారు.
ఈ క్రమంలో మూడు నెలలు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సెలవులు లేకుండా పని చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే, ఈ మూడు నెలలు పాటు సెలవులు లేకుండా విధులు నిర్వహించిన డ్రైవర్లు, కండక్టర్లకు ప్రతినెలా రూ.500 చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ.యాదగిరి తెలిపారు. నగరంలో సిటీ బస్సులతో రోజూ రూ.4 కోట్ల వరకు ఆదాయం వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా అనేక కార్యక్రమాలను రూపొందించారు.
ముఖ్యమైన నిర్ణయాలు ఇలా ఉన్నాయి..