11వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 18 అంశాలకు ఆమోదం
స్కిల్డెవలప్మెంట్పై మురికివాడల్లోని యువతకు శిక్షణ
కైత్లాపూర్ ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద.. రూ.300 కోట్లతో సీఎన్జీ గ్యాస్ ప్లాంట్
పార్కుల నిర్వహణ బాధ్యతలు చూసుకునేలా ప్రైవేటు సంస్థలతో ఎంఓయూ
సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ ) : నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం 11వ స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీ సమావేశంలో 18 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. కమిషనర్ డీఎస్.లోకేశ్కుమార్, అదనపు కమిషనర్లు శృతి ఓజా, కెనడీ, ప్రాజెక్ట్ సీఈ దేవానంద్, సీసీపీ దేవేందర్ రెడ్డి, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, అడిషనల్ సీపీ శ్రీనివాస్, జోనల్ కమిషనర్లు శంకరయ్య, రవికిరణ్, మమత, పంకజ, శ్రీనివాస్ రెడ్డి, సామ్రాట్ అశోక్ , స్టాండింగ్ కమిటీ సభ్యులు పన్నాల దేవేందర్ రెడ్డి, మహ్మద్ అబ్దుల్ సలామ్ షాహిద్, మహపర, మిర్జా ముస్తఫా బేగ్, పర్వీన్ సుల్తానా, మందగిరి స్వామి, మహ్మద్ రషీద్ ఫరాజుద్దిన్, సీఎన్.రెడ్డి, మద్ది శ్రీనివాస్ రావు, సామల హేమ, కుర్మ హేమలత తదితరులు పాల్గొన్నారు.