Suicide | హైదరాబాద్ : జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. ఓ 70 ఏండ్ల వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడిని కుత్బుల్లాపూర్ రామకృష్ణ నగర్లో కట్టెల మండి నిర్వహిస్తున్న జానయ్యగా గుర్తించారు.
అయితే జానయ్య ఉరేసుకున్న సమయంలో అక్కడ ఓ మహిళ ఉండటాన్ని స్థానికులు గమనించారు. దీంతో ఆమెను కట్టెల మండిలోని ఓ గదిలో నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. అక్రమ సంబంధమే ఈ ఘటనకు దారి తీసి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కట్టెల మండిలో క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. అనంతరం డెడ్బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.