శంషాబాద్ రూరల్, జూలై 25 : శంషాబాద్ మండలంలోని ఎంటేరు వాగునుంచి హిమాయత్సాగర్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. ఈ వరద నీటిలో సుమారు 70 నుంచి 80 కిలోల చేప ఈదుకుంటూ వెళ్తుండగా సుల్తాన్పల్లి- కేబిదొడ్డి గ్రామాల వాసులు వారి సెల్ఫోన్లలో బంధించారు. ఈవీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.