సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): నగరంలో పనిచేస్తున్న 69 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల సందర్భంగా ఆయా అధికారులకు సీపీ సీవీ ఆనంద్ కౌన్సిలింగ్ చేశారు. అనంతరం బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత కౌన్సిలింగ్.. ఆ తర్వాత బదిలీల ఉత్తర్వులు.. ఈ కొత్త విధానానికి సీపీ శ్రీకారం చుట్టారు.
పలు విభాగాల్లో మూడేండ్లు పూర్తి చేసుకున్న వారిని బదిలీలు చేస్తూ కొత్తగా పోస్టింగ్లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ చౌహాన్, ఏఆర్ శ్రీనివాస్, జాయింట్ సీపీలు సీపీ రంగనాథ్(ట్రాఫిక్), ఎం.రమేశ్(అడ్మిన్), విశ్వప్రసాద్(ఎస్బీ), కార్తికేయ (కార్ హెడ్క్వార్టర్స్), గజారావు భూపాల్ (సీసీఎస్) తదితరులు పాల్గొన్నారు.