Double Decker Bus | సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): మహానగరానికి ఎంతో అనుబంధం ఉన్న డబుల్ డెక్కర్ బస్సులు కనుమరుగైపోకుండా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 6 ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేసింది. ప్రస్తుతం వీటిని నగరంలో మూడు మార్గాల్లో నగరవాసులు పూర్తిగా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించింది.
హుస్సేన్సాగర్ ఇందిరాగాంధీ రోటరీ వద్ద ఉన్న సీవరేజ్ ట్రీట్ ప్లాంట్ నుంచి బస్సులు నిత్యం రాకపోకలు సాగించేలా మార్గాలను ఖరారు చేశారు. ఇందులో మొదటి రూట్ను నెక్లెస్రోడ్డు నుంచి హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, విప్రో జంక్షన్ మీదుగా వేవ్ రాక్ వరకు, అదేవిధంగా రెండవ రూట్ను చార్మినార్ వరకు, మూడవ రూట్ను ట్యాంక్బండ్ చుట్టూ నడుపుతున్నారు.