హైదరాబాద్ : నగరంలోని మణికొండలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. అల్కాపురి కాలనీలోని ఓ అపార్ట్మెంట్లోకి శుక్రవారం రాత్రి దొంగలు చొరబడ్డారు. ఆ అపార్ట్మెంట్లోని రెండు ఇండ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. రెండు నివాసాల్లో ఉన్న 50 తులాల బంగారం, రూ. 2 లక్షలను దోపిడీ దొంగలు అపహరించారు.
బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన నివాసాల్లో క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తోంది. ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.