కాచిగూడ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు (Reservations) కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే పార్లమెంట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడ అభినందన్ హోటల్లో వివిధ రాష్ట్రాల బీసీ సంఘాల నాయకుల( BC Leaders) తో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 5,6 తేదీలలో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ’ లో వేలాది మంది బీసీలతో పార్లమెంట్ ( Parliament ) ను ముట్టడిస్తామని పేర్కొన్నారు.
బీసీలకు రావాల్సిన రాజ్యాంగపరమైన హక్కులను కల్పించకుండా మోదీ (Narendra Modi) ప్రభుత్వం అణిచివేస్తుందని, మోదీ బీసీల పట్ల వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. బీసీల హక్కులను పరిష్కరించకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, సుందరయ్య,నీల వెంకటేశ్,సుధాకర్, రాజ్కుమార్, నందగోపాల్, కృష్ణయాదవ్, రాందేవ్, ఉదయ్, రాజేందర్, వాసిరెడ్డి,జయంతిగౌడ్,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.