రంగారెడ్డి : శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ. 23.33 లక్షల విలువైన 472 గ్రాముల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. పేస్ట్ రూపంలో తెచ్చిన బంగారాన్ని అధికారులు గుర్తించారు. గువాహటి నుంచి వచ్చిన ఇండిగో విమానంలో బంగారాన్ని గుర్తించి, సదరు ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు.