Hyderabad | హైదరాబాద్ : జీడిమెట్ల( Jeedimetla) పరిధిలోని చెరుకుపల్లిలో 40 ఏండ్ల నాటి ఓ పాత భవనం( Old Building ) గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఆ పాత భవనానికి మరమ్మతులు చేస్తుండగా కుప్పకూలిపోయినట్లు స్థానికులు తెలిపారు. పక్కనున్న మూడు భవనాలపై శిథిలాలు పడటంతో గోడలు దెబ్బతిన్నాయి. దీంతో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. కూలిన భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు( Police ) ఘటనాస్థలికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు.