హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో 40 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వీసాలతో కువైట్కు వెళ్లేందుకు యత్నించిన 40 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. మహిళలను గోవా, తమిళనాడు, ఏపీ, తెలంగాణకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం ఆర్జీఐ పోలీసులకు అప్పగించారు. ఏజెంట్ మోసం చేశాడా? ఉద్దేశపూర్వకంగానే వెళ్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.