Rangareddy | రంగారెడ్డి : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్లోని డీడీ కాలనీలో నసీర్ హైమద్ అనే సివిల్ ఇంజినీర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 35 తులాల బంగారంతో పాటు రూ. 1.5 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యులతో కలసి హైమద్ షాపింగ్ కోసం బయటకు వెళ్లాడు. షాపింగ్ నుంచి తిరిగొచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లోని బీరువాలో ఉన్న బంగారంతో పాటు నగదు కనిపించలేదు. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఆధారాలను సేకరించారు. ఇంటి ఓనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.