హైదరాబాద్: హైదరాబాద్లో ప్రధాన రవాణా సౌకర్యాల్లో ఒకటైన ఎంఎంటీఎస్ (MMTS) సర్వీసులు నేడు సగమే నడవనున్నాయి. రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల వల్ల 36 ఎంఎంటీఎస్ సర్వీలను రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. నగరంలో మొత్తం 79 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తున్నాయి. ఇందులో 36 సర్వీసులను నేడు రద్దుచేసింది.
వీటిలో లింగంపల్లి-హైదరాబాద్ మీదుగా నడిచే 9 సర్వీసులు, హైదరాబాద్ లింగంపల్లి 9 సర్వీసులు, ఫలక్నుమా-లింగంపల్లి 8 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్నుమా 8 సర్వీసులు, సికింద్రాబాద్-లింగంపల్లి ఒక సర్వీసు, లింగంపల్లి-సికింద్రాబాద్ ఒక సర్వీసు ఉన్నాయి. రైల్వే ట్రాక్ పనులు పూర్తయిన తర్వాత యధావిధిగా సర్వీసులు నడుస్తాయని అధికారులు తెలిపారు.