Hyderabad | హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఆధారాల్లేకుండా తీసుకెళ్తున్న నగదును, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. హైదరాబాద్ చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 33.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ, ప్రశాంత్ నగర్, మూసాపేట ఏరియాల్లో సీఐ సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రూ. 21,60,920లను పోలీసులు సీజ్ చేశారు. ఈ నగదు ఎనిమిది వాహనాల్లో పట్టుబడిందని పోలీసులు తెలిపారు.