సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో 12వ రోజు నాటికి లక్షమందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఒక్కరోజే గ్రేటర్లో 274 కేంద్రాల్లో 30,727 మందికి పరీక్షలు చేశారు. అందులో 9,333 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా.. 4,545 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్కు సిఫారసు చేసినట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ జిల్లాలో 115 కేంద్రాల్లో కంటి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. మొత్తం 12,444 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 4,640 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేశారు. 1796 మంది రోగులకు ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్కు సిఫారసు చేసినట్లు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో 80 కేంద్రాల్లో మొత్తం 9,704 మందికి కంటి పరీక్షలు చేశామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. వారిలో 1775 మంది రోగులకు రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా, 1468 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్కు సిఫారసు చేశారు.
మేడ్చల్ జిల్లా పరిధిలో మొత్తం 79 కేంద్రాల ద్వారా 8579 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. 2,918 మంది రోగులకు రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా… 1281మందిని ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్కు సిఫారసు చేసినట్లు తెలిపారు.