సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో 18వ రోజు 274 కేంద్రాల్లో 30,111 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 7,091 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీ చేయగా 3,658 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
నగరంలో 115 కేంద్రాల్లో కంటి పరీక్షలు నిర్వహించినట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి వెల్లడించారు. 18వ రోజు మొత్తం 11,216 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 3,368 మందికి రీడింగ్ గ్లాసెస్ను అందించామని, 1,530మంది రోగులకు ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేశామన్నారు.
జిల్లా పరిధిలో 80 కేంద్రాలలో కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా మొత్తం 10,551 మందికి కంటి పరీక్షలు జరిపామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. వారిలో 1, 488మంది రోగులకు రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా, 1,212 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేశామన్నారు.
మేడ్చల్ జిల్లా పరిధిలో మొత్తం 79కేంద్రాల ద్వారా 8,344 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ వెల్లడించారు. వారిలో 2,235 మంది రోగులకు రీడింగ్ గ్లాసెస్, 916 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేసినట్లు తెలిపారు.