మేడ్చల్ జోన్ బృందం, డిసెంబరు 28: పలు సందేహాలు, అపనమ్మకాల మధ్య ప్రజా పరిపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంనియోజకవర్గ వ్యాప్తంగాగురువారం ప్రారంభమైంది.దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రశాంతంగానే జరిగినప్పటికీ ఆరు గ్యారంటీల అమలుపై అధికారుల్లో స్పష్టత కొరవడంపై ప్రజల్లో అపనమ్మకాలను కల్గించింది. ఒక పథకానికి ఒకే దరఖాస్తు సరిపోతుందా, అన్ని పథకాలకు ఒకే దరఖాస్తు సరిపోతుందా అని ప్రజలు వాకబు చేయడం కన్పించింది. దరఖాస్తు తీసుకున్న అధికారులు రశీదు ఇస్తున్నప్పటికీ ఆ తర్వాత జరిగేది ఏంటని ప్రజల నుంచి వ్యక్తమైన సందేహానికి ఇంకా మార్గదర్శకాలు రాలేదని సమాధానం వచ్చింది. మార్గదర్శకాల అనంతరం దరఖాస్తులను ఆన్లైన్ చేయడమా, క్షేత్ర స్థాయికి వెళ్లి దరఖాస్తుల పరిశీలన చేయడమా అనే ఇంకా స్పష్టత లేదు. కొత్త రేషన్కార్డుల కోసం మాత్రం తెల్ల కాగితంపై దరఖాస్తు తీసుకోవడంపై కూడా అపనమ్మకం ఏర్పడింది. ప్రజాపాలన దరఖాస్తు ఫారంలో కొత్త రేషన్ కార్డు కోసం ప్రామాణికత ఏమిటన్న సందేహం వ్యక్తం అయింది. చాలా మంది మేడ్చల్ నియోజకర్గంలోని దమ్మాయిగూడ, మేడ్చల్, నాగారం, గుండ్లపోచంపల్లి, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్నగర్ తదితర ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డారు. వారి ఆధార్ కార్డులో అడ్రస్ సొంత ఊరికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలా, ఇక్కడే దరఖాస్తు చేసుకోవచ్చా అనే సం దేహం వ్యక్తం చేశారు. ఈ సందేహం ప్రధానంగా రైతుబంధు విషయంలో వ్యక్తమైంది.
నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజాపరిపాలన దరఖాస్తులు వెల్లువెత్తాయి. నియోజకవర్గంలో మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో దరఖాస్తులు తీసుకున్నారు.చైర్పర్సన్లు మర్రి దీపికానర్సింహారెడ్డి, లక్ష్మీశ్రీనివాస్రెడ్డి, కమిషనర్లు రాములు, త్రిల్లేశ్వర్రావు ఆధ్వర్యంలో దరఖాస్తులను స్వీకరించారు. ఎంపీడీవో పద్మావతి ఆధ్వర్యం లో మేడ్చల్ మండలంలోని ఒక బృందం రాయిలాపూర్, బండమాదారంలో, తహసీల్దార్ శైలజ ఆధ్వర్యంలో మరో బృందం మునీరాబాద్ గ్రామం లో ఎంపీపీ రజితా రాజమల్లారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్డీవో రాజేష్ కుమార్ పరిశీలించారు. శామీర్పేట మండలంలోని ఎంపీడీవో వాణి గర్దాస్ ఆధ్వర్యంలో యాడారంలో, తహసీల్దార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో తుర్కపల్లి గ్రామంలో, మూడుచింతలపల్లి ఎంపీడీవో వత్సలాదేవి ఆధ్వర్యంలో పోతారం గ్రామంలో, తహసీల్దార్ వాణిరెడ్డి ఆధ్వర్యంలో కేశ్వాపూర్ గ్రామంలో దరఖాస్తులను స్వీకరించారు.
తూంకుంట మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో కమిషనర్ జేతూరామ్నాయక్ తెలిపారు. జవహర్నగర్ కార్పొరేషన్లో మేయర్ కావ్య దరఖాస్తుల స్వీకరించారు. అడిషినల్ డీసీపీ సీసీఎస్ లక్ష్మి, ఏసీపీ విజయ్ శ్రీనివాస్, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఘట్కేసర్ మం డలం ఎదులాబాద్లో గంటలోపే వెయ్యి ఫారాలు అయిపోయినట్లు అధికారులు ప్రకటించటంతో నిరాశతో ప్రజలు వెనుదిరిగారు. దరఖాస్తు ఫారా లు తీసుకోవటానికి, మళ్లీ ఇవ్వటానికి క్యూ లైన్లు పాటించకపోవటంతో వృద్ధు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దరఖాస్తు ఫారాలు తీసుకున్న తర్వాత పూర్తి చేసి ఇచ్చేందుకు సహాయకులు లేకపోవటంతో ఏమి చేయాలో ప్రజలకు పాలు పోక అయోమయంలో పడ్డారు. కాచవానిసింగారంలో దరఖాస్తు ఫారాల పంపిణీలో తోపులాట జరిగింది. ఒక్కసారిగా అందరు ఎగబడటంతో వృద్ధులు ఇబ్బందులు పడ్డా రు. కాచవానిసింగారం పంచాయతీ కార్యాలయంఆవరణలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ జయేందర్ రెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డితో కలిసి, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి పరిశీలించారు.
కీసర మండలంలోని రాంపల్లిదాయరలోఎంపీడీవో గ్యామ, భోగారం గ్రామానికి తహసీల్దార్ అశోక్కుమార్ల అధ్యక్షతన గ్రామసభలను నిర్వహించారు. ఘట్బోడుప్పల్ పరిధిలోని దరఖాస్తుల స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన పరిసరాల్లో జీరాక్స్ సెంటర్లు, ఈ సేవ కేంద్రాలు కిక్కిరిపోయాయి. పీర్జాదిగూడలో మేయర్ వెంకట్రెడ్డి, కమిషనర్ ఇస్లావత్ నమ్య దరఖాస్తుల స్వీకరించారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో చైర్మన్లు చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కమిషనర్లు రాజేందర్కుమార్, రాజమల్లయ్య దరఖాస్తుల స్వీకరించారు. బోడుప్పల్ నగరపరిధిలోని 12వ డివిజన్ అంబేద్కర్ నగర్ కాలనీ, 25వ డివిజన్ ఇందిరానగర్ కాలనీ, 7వ డివజన్ లక్ష్మీనగర్ కాలనీలో పురపాలన శాఖ కమిషనర్ దాసరి హరిచందన, అడిషనల్ డైరెక్టర్ జాన్ శాంసన్, బోడుప్పల్, పోచారం మున్సిపాటీల్లో జరిగిన దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు.
దరఖాస్తులు చేసుకోవాలే అంటున్నరు కానీ,వివరంగా ఎవరూ చెప్పడంలేదు. వివరాలు చెప్పే వారే లేరు. ఆడోళ్లకు మొగళ్లకు వేర్వేరు లైన్లు ఏర్పాటు చేస్తనన్నరు. కానీ అందరినీ కలిసి ఒకే లైన్ ఏర్పాటు చేశారు. దీంతో ముసలొళ్లకు కష్టమైతుంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి.గ్యాస్ తక్కువ కావాలంటే రేషన్ కార్డు కావాలంట. దానికేమో దరఖాస్తు లేదంట. అన్నిటికి ఇస్తే బాగుంటది.
-సుక్కమ్మ, ఎదులాబాద్.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అన్ని ఫ్రీ అని చెప్పి ఇప్పడు కొట్లాటలు పెడుతుండ్రు. పొద్దుగాల వచ్చినా ఎవరికి దరఖాస్తు ఇయ్యలే కూడా చెప్పడం లేదు. క్యూ లైన్ పెట్టకుండా దరఖాస్తుల ఫారాలు పంచుతుంటే కొట్లాటలు అవుతున్నాయి. ముసలొల్ల గురించి కూడా ఆలోచించాలే. ఓట్లప్పుడు కమ్మగా మట్లాడుతారు. అన్ని ఇప్పిస్తమంటరు. ఇప్పుడు ఒక్కడు లేడు. కష్టాలు లేకుండా చూడాలే.
-భారతమ్మ, కాచవానిసింగారం