సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ ) : ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి క్రమంగా వరద ఉధృతి పెరుగుతున్నది. హిమాయత్సాగర్లోకి 2500 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా నాలుగు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 2750 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. ఉస్మాన్సాగర్లోకి 1100 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. గరిష్ఠ స్థాయి నీటి మట్టానికి ఇంకా రెండున్నర అడుగుల మేర రావాల్సి ఉంది. గరిష్ఠ స్థాయి నీటి మట్టానికి చేరువ కాగానే ఈ రిజర్వాయర్ నుంచి దిగువ మూసీలోకి వరద నీటిని పంపించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. వరద అంచనా బట్టి హిమాయత్సాగర్ నుంచి ఇన్ఫ్లోను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసీకి వరద పొట్టెత్తింది. హిమాయత్సాగర్ జలశయం నుంచి నీరు వదలడంతో అత్తాపూర్ వద్ద మూసీలో నీరు భారీగా పారుతుంది. త్రివేణి సంగమం వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది.