హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో రాచకొండ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీ(ఆంధ్రా – ఒడిశా సరిహద్దు) నుంచి రాష్ట్రానికి తరలిస్తుండగా, పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 240 కిలోల గంజాయి, రూ. 8 లక్షల నగదు, లారీ, 2 కార్లు, 19 సెల్ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.