బేగంపేట, నవంబర్ 21: బాటసారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. దాడులకు పాల్పడుతున్న ఓ యువకుడిపై బేగంపేట పోలీసులు ఈ పెట్టి కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచగా.. నిందితుడికి 240 రోజుల జైలు శిక్షతోపాటు 11 వందల జరిమానా విధించింది. బేగంపేట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
బేగంపేట మయూరి మార్గ్కు చెందిన భీమ్ సూర్య (19) రోడ్లపై చిల్లరగా తిరుగుతూ.. బాటసారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు అకారణంగా దాడులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నుంచి ఫిర్యాదు అందుకున్న బేగంపేట పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, సోమవారం కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి 240 రోజుల జైలు శిక్ష, జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో 60 రోజుల పాటు జైలు శిక్ష పెరుగుతుందని న్యాయస్థానం ఆదేశించింది.