సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ ): మహానగర దాహార్తికి ఇక దిగులే లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోర్సిటీతో పాటు శివారు ప్రాంతాలకూ పుష్కలంగా తాగునీరు అందనున్నది. ఔటర్ లోపల మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటిని అందించేందుకుగానూ జలమండలి రూ. 1200కోట్లతో ఓఆర్ఆర్ ఫేజ్-2 పనులు చేపట్టింది. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, పటాన్చెరు నియోజకవర్గాల్లో రెండు ప్యాకేజీలుగా విభజించి యుద్ధప్రాతిపదికన చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగానే 23 చోట్ల రిజర్వాయర్లను సోమవారం మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, ప్రకాశ్గౌడ్, గూడెం మహిపాల్రెడ్డి ప్రారంభించనున్నారు. ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్టు పూర్తై రిజర్వాయర్లు అందుబాటులోకి వస్తే 6.32 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది.
హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా వెస్ట్ కారిడార్లో పెట్టుబడులకు కంపెనీలు క్యూ కడుతుండడం, ఐటీ కంపెనీల రాకతో భారీగా వస్తున్న ఉపాధి అవకాశాలతో జనాభా పెరుగుతున్నది. దీంతో మౌలిక వసతుల కల్పనకు అవసరం ఏర్పడింది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్ అవసరాలకు కూడా సరిపోయేలా ప్రణాళికలను అమలు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగానే కోర్ సిటీ తరహాలోనే శివారు ప్రాంతాల్లోనూ పుష్కలంగా తాగునీటి అందించేందుకు జలమండలి ఓఆర్ఆర్ ఫేజ్-2 పథకానికి అంకురార్పణ చేసింది. ఔటర్ లోపల మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటిని అందించేందుకు రూ. 1200కోట్లతో ఓఆర్ఆర్ ఫేజ్-2 పనులు చేపట్టింది. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, పటాన్చెరు నియోజకవర్గాల్లో రెండు ప్యాకేజీలుగా విభజించి యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగానే 23 చోట్ల రిజర్వాయర్లను సోమవారం ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు. మహేశ్వరం, ఇబ్రహీపట్నం, రాజేంద్రనగర్, పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, ప్రకాశ్గౌడ్, గూడెం మహిపాల్రెడ్డి ఈ రిజర్వాయర్లను ప్రారంభించనున్నారు.
విడతల వారీగా కాలనీలకు సమృద్ధిగా నీరు
137 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణ పనులు, 2,864 కిలోమీటర్ల మేరలో ఇన్లెట్, అవుట్ లెట్ పైపులైన్ విస్తరణ పనులను దాదాపు పూర్తి చేశారు. ఈ మేరకు మొదటి ప్రాధాన్యతగా తీసుకున్న కాలనీల్లో పనులు పూర్తి చేసి ఇప్పటికే 60 కాలనీల ప్రజలకు సమృద్ధిగా నీటిని అందిస్తున్నారు. మరో 58 కాలనీలకు నీటి సరఫరా చేసేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే 23 రిజర్వాయర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న 50 దశల వారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రాజెక్టు స్వరూపం ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్టుకు 2022లో శ్రీకారం చుట్టారు. రూ.1200కోట్ల వ్యయంతో చేపట్టగా..కొత్తగా 73 సర్వీస్ రిజర్వాయర్లు (138 మిలియన్ లీటర్ల సామర్థ్యం) 2988 కిలోమీటర్ల మేర నూతన పైపులైన్ నెట్వర్క్ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయి రిజర్వాయర్లు అందుబాటులోకి వస్తే 6.32 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. రెండు ప్యాకేజీల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. ప్యాకేజీ వరకు ఏడు మండలాలు, 34 సర్వీస్ రిజర్వాయర్లు, 1571 కిలోమీటర్ల మేర పైపులైన్ నెట్వర్క్ పనులతో 4.36 లక్షల మందికి ప్రయోజనం జరుగుతుంది. ప్యాకేజీలో 2లో భాగంగా కొత్తగా 41 సర్వీస్ రిజర్వాయర్లు, 1293 కిలోమీటర్ల మేర పైపులైన్ నెట్వర్క్, ఏడు మండలాల్లోని 1.96 లక్షల మందికి లబ్ధి కలుగనున్నది.
రిజర్వాయర్లు ప్రారంభించే ప్రజాప్రతినిధి
శ్రీనివాసనగర్, రైతుబజార్, పీర్జాదిగూడ,ద్వారకాపురి కాలనీ, అపెరల్ పార్కు ; మంత్రి మల్లారెడ్డి
తుక్కుగూడ ; మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తట్టి అన్నారం, సీఎన్ క్రికెట్ స్టేడియం,కావేరి ఫంక్షన్ హాల్, ఆదిబట్ల ; ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
బీరంగూడ-పీజేఆర్ కాలనీ ; ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
కిస్మత్పూర్, అభ్యుదయ నగర్, బైరాగిగూడ, బృందావన్ కాలనీ, నార్సింగి,గండిపేట్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద ;ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్
రిజర్వాయర్ ప్రాంతంసామర్థ్యం (మిలియన్ గ్యాలన్లు)
కిస్మత్పూర్ 1
అభ్యుదయ నగర్ 1
బైరాగి గూడ 1
బృందావన్ కాలనీ 2.50
నార్సింగి 1
గండిపేట ఎమ్మార్వో కార్యాలయం 2
తట్టి అన్నారం 1
సీఎన్ఆర్ క్రికెట్ గ్రౌండ్ 2
కావేరి ఫంక్షన్ హాల్ 1
ఆదిబట్ల 0.50
తుక్కుగూడ 1
అపెరల్ పార్కు 1
అపెరల్ పార్కు-1 1
శ్రీనివాస నగర్ 2
రైతు బజార్ 2
పీర్జాదిగూడ 5
ద్వారకపురి కాలనీ 1
పీజేఆర్ కాలనీ-1(అమీన్పూర్) 1
పీజేఆర్ కాలనీ-2 1
బీరంగూడ 4
ద్వారకపురి కాలనీ 1
అపర్ణ ఎంజీఆర్ 2
కమ్మగూడ 5