సిటీబ్యూరో, మార్చి 20 ( నమస్తే తెలంగాణ ) : నగరంలో( Hyderabad) 23 గ్రీన్ ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు(Green Electric Metro Express Buses) రాకపోకలు అందుబాటులో ఉన్నట్టు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సికింద్రాబాద్-మణికొండ మార్గంలో 12 బస్సులు, పటాన్ చెరువు-సీబీఎస్ మార్గంలో 6 బస్సులు, పటాన్ చెరువు-కోఠి మార్గంలో 5 బస్సులు ప్రతీ పది, 15 నిమిషాలకు అందుబాటుల ఉంటాయని తెలిపారు. ఈ బస్సులన్నింటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని వివరించారు.