వైకుంఠ ధామాలు
నల్లగొండ జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీకి వైకుంఠ ధామం చొప్పున మొత్తం 844
నిర్మాణాలకు మంజూరీ ఇచ్చారు. ఒక్కో వైకుంఠ ధామానికి ప్రభుత్వం రూ.12.60లక్షలు కేటాయించింది. ఇప్పటి వరకు 801పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి.
సూర్యాపేట జిల్లాలోని 475గ్రామ పంచాయతీలకు గాను 475వైకుంఠధామాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. ఇందులో 421నూరు శాతం పూర్తి కాగా కేవలం మూడింటి పనులు ప్రారంభించలేదు. మిగిలిన 51వైకుంఠ ధామాల పనులు 90శాతం పూర్తయ్యాయి.
డంపింగ్ యార్డులు
నల్లగొండ జిల్లాలోని 844గ్రామాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు అన్నీ పూర్తయ్యాయి. ప్రతి డంపింగ్ యార్డుకు రూ.30వేల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేసింది. సూర్యాపేట జిల్లాలో 475గ్రామాల్లో గ్రామానికి ఒకటి చొప్పున మొత్తం 475డంపింగ్ యార్డులు మంజూరయ్యాయి. 473పూర్తి కాగా 452ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
సెగ్రిగేషన్ షెడ్లు
చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చేందుకు ప్రతి డంపింగ్ యార్డులో ఒక సెగ్రిగేషన్ షెడ్ ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 844షెడ్లకు గాను ఇప్పటి వరకు 815పూర్తయ్యాయి. ప్రతి షెడ్కు ప్రభుత్వం రూ.2.50 లక్షలు ఖర్చు చేసింది. సూర్యాపేట జిల్లాలోని 475గ్రామాల్లో డంపింగ్ యార్డ్తో పాటు సెగ్రిగేషన్ షెడ్ కూడా నిర్మించారు. డంపింగ్ యార్డులతో పాటు వీటిని కూడా పూర్తి చేశారు.
పల్లె ప్రకృతి వనాలు
నల్లగొండ జిల్లాలో 1425 ప్రకృతి వనాల్లో ఎకరం విస్తీర్ణంలో 800, అర ఎకరంలో 250, 20గుంటల్లో 375 ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు అన్నీ పూర్తయ్యాయి. రెండేండ్లకు ఎకరం వనాలకు రూ.6.27లక్షలు, అరెకరం వనాలకు రూ.5.05లక్షలు, 20గుంటల్లో ఉన్న వనాలకు రూ.4.02లక్షలు ప్రభుత్వం ఖర్చు చేసింది.
సూర్యాపేట జిల్లాలో 475గ్రామ పంచాయతీల పరిధిలో 679పల్లె ప్రకృతి వనాలు మంజూరయ్యాయి. ఇప్పటివరకు 664పూర్తి చేయగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. వీటిల్లో మొత్తం 8.46లక్షల మొక్కలు నాటారు.
నర్సరీలు
నల్లగొండ జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ చొప్పున మొత్తం 844గ్రామాల్లో ఏర్పాటు చేశారు. ప్రతి నర్సరీలో కనీసం 10వేల మొక్కలు పెంచేలా చర్యలు తీసుకున్నారు. బ్యాగ్, వాచర్, ఇతర నిర్వహణకు ఒక్కో నర్సరీకి ప్రభుత్వం రూ.2.50లక్షలు ఖర్చు చేసింది.
సూర్యాపేట జిల్లాలో మొత్తం 475నర్సరీలను ఏర్పాటు చేశారు. వీటిని 425చోట్ల ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేయగా మరో 50నర్సరీలను ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు చేశారు. ఈ నర్సరీల్లో మొత్తం 85.31లక్షల మొక్కలను పెంచుతున్నారు.