Hyderabad
- Jan 26, 2021 , 04:26:13
VIDEOS
లోఫ్రెషర్ సమస్యకు శాశ్వత పరిష్కారం

అంబర్పేట, జనవరి 25 : నల్లకుంట డివిజన్, ఓల్డ్ నల్లకుంట వివేకానందస్వామి విగ్రహం పక్కలేన్లో రూ.6 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న మంచినీటి పైపులైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవిరమేశ్తో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సోమవారం ప్రారంభించారు. కొంత కాలంగా ఈ ప్రాంతంలో మంచినీరు లోఫ్రెషర్తో వస్తుండటంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో రూ. ఆరు లక్షలతో కొత్త పైపులైన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పైపులైన్ పనులు పూర్తయితే బస్తీవాసులకు మంచినీటి లోఫ్రెషర్ సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందన్నారు. అలాగే మొరంక్వారీ బస్తీలో రూ.5 లక్షలతో ఏర్పాటు చేయనున్న నూతన డ్రైనేజీ పైపులైన్ పనులను కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కుక్క పిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ తనయుడు
- వృద్ధురాలి హత్య : కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి..!
- వైష్ణవ్ తేజ్ లేకపోతే నా 'ఉప్పెన' ఒంటరి అయ్యుండేది
- గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!
- ఐపీఎల్లో క్రికెట్కు విలువ లేదు.. పాకిస్థాన్ లీగే బెటర్!
- ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 10 మంది హైదరాబాదీలు
- ఎంపీ నంద్కుమార్ సింగ్ చౌహాన్ మృతికి రాష్ట్రపతి సంతాపం
- ఇన్స్టాలో జాన్ అబ్రహం షర్ట్లెస్ పిక్ వైరల్!
- పవన్ ఫుల్బిజీ..ఒకే రోజు రెండు సినిమాలు
- కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయడమెలా
MOST READ
TRENDING