బడంగ్పేట, జూలై 23: నగరంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు వరదల్లా వస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, ఇతర త్రా పార్టీల నుంచి వలసలు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, దానం నాగేందర్ల సమక్షంలో ఆదివారం ఒక్కరోజే దాదాపు ఐదొందల మంది బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. చేరికల నేపథ్యంలో మంత్రి సబితారెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 200 మంది బీజేపీ, కాం గ్రెస్ పార్టీలకు చెందిన నాయకులకు బీఆర్ఎస్ పార్టీ కం డువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక నేత వెంకటేష్ ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ద్వారనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదన్న విషయాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ పొరుగు పార్టీ ల నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ర్టాన్ని అధోగతి పాల్జే సే అవకాశాలు ఉన్నాయని, ఆ పార్టీలను ప్రజలు నమ్మ డం లేదన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి సముచిత స్థానం ఉంటున్నదన్నారు. పార్టీలో కొత్త పాత తేడా లేకుం డా పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఉంటున్నదన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బూడిద తేజస్వీ శ్రీకాంత్ గౌడ్, చప్పిడి లావణ్య రాజు, రవి నాయక్, రెడ్డిమల్ల సుమన్, బీఆర్ఎస్ నాయకులు బషీర్, వీరేష్ గౌడ్, జయశ్రీ, శ్రీలత, సామ్యేల్ రాజు, సుందరయ్య, శ్రీలత, నాజర్, బాషా, ప్రవీణ్, వెంకటేష్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి.. సంక్షేమం: ఎమ్మెల్యే కృష్ణారావు
కేపీహెచ్బీ కాలనీ: బీఆర్ఎస్తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని, సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలానగర్ డివిజన్ ఇందిరానగర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నేత బాలస్వామి 200 మంది అనుచరులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ, 70 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్టం, దేశానికి ఒరిగిందేమీ లేదని, తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిని సాధించిందన్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ సీఎం కేసీఆర్ పాలన సంక్షేమ ఫలాలు అందిస్తున్నదన్నారు. ఐడీఎల్ స్థలంలో నిరుపేదలు గుడిసెలు వేసుకుని జీవనాన్ని కొనసాగిస్తుంటే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆ ఇండ్లను కూల్చాలని లెటర్లు రాశారని మండపడ్డారు. కార్యక్రమంలో గోవు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లోకి పెద్ద ఎత్తున వలసలు: ఎమ్మెల్యే దానం
బంజారాహిల్స్: తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ విజ యం సాధిస్తేనే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారనే అభిప్రాయం చాలామందిలో ఏర్పడిందని, అందుకే ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. జూబ్లీహిల్స్ డివిజన్ దుర్గాభవానీగర్ బస్తీకి చెందిన సుమారు 60 మంది యువకులు ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే దానం వారికి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, అభివృద్ధిలో దేశానికే తెలంగాణ తలమానికంగా మారిందన్నారు. కార్యక్రమంలో వినోద్, సాయి, కిరణ్, చింటూ, రాజు, హరి, వెంకీ, కళ్యాణ్, ఆనంద్, స్వామి తదితరులతో పాటు కార్పొరేటర్ వెంకటేశ్, బీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు, బోజిరెడ్డి, నగేష్ పాల్గొన్నారు.