సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్, హైదరాబాద్ జంటనగరాలు, సబర్బన్ ప్రయాణికుల కోసం అందుబాటులో ఉండే ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసుల సంఖ్య పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న లింగంపల్లి- హైదరాబాద్, ఫలక్నుమా-సికింద్రాబాద్ వంటి మార్గాలతో పాటు కొత్తగా మేడ్చల్-సికింద్రాబాద్తో పాటు ఫలక్నుమా నుంచి ఉందానగర్కు సర్వీసులను పొడిగించారు.
ఈ సర్వీసులు కూడా 20 వరకు ఉన్నట్లు తెలిపారు. అలాగే సికింద్రాబాద్-మేడ్చల్ మార్గంలో కూడా కొత్తగా 20 ఎంఎంటీఎస్ సర్వీసును పొడిగిస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గతంలో48 కిలో మీటర్ల వరకు మాత్రమే లోకల్ రైళ్లు నడిచేవి. ప్రస్తుతం కొత్తగా అందుబాటులోకి వచ్చిన లోకల్ రైలు సర్వీసులతో కలిపితే మొత్తం 90 కిలోమీటర్ల వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. దీంతో పాత, కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను కలిపితే మొత్తంగా జంటనగరాల్లో 106 ఎంఎంటీఎస్సర్వీసులు నగర ప్రయాణికుల కోసం అందుబాటులోకి వచ్చిందన్నారు.