Gold Seize | హైదరాబాద్ : బంగారం స్మగ్లింగ్కు పాల్పడుతున్న నలుగురు నిందితులను శంషాబాద్ ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.27 కోట్ల విలువ చేసే 2.1 కిలోల బంగారాని స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే… హైదరాబాద్కు చెందిన నలుగురు వ్యక్తులు దుబాయ్ నుంచి బుధవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో సదరు వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో కస్టమ్స్ అధికారులు వారిని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో నిందితుల వద్ద రూ.1.27 కోట్ల విలువైన 2.1 కిలోల బంగారం లభించింది. ఈ మేరకు అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.