Gold Seized | పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్లోని రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి దాదాపు రెండుకిలోలకుపైగా గోల్డ్ను స్వాధీనం చేసుకున్నారు. దుబాయి, షార్జా, బహ్రెయిన్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి బంగారాన్ని గుర్తించారు.
ఆరుగురు ప్రయాణికుల వద్ద 3.73 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.2.12కోట్లు ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఓ వ్యక్తి బంగారాన్ని పేస్ట్గా మార్చి జీన్స్ ప్యాంట్లో దాచి తీసుకురాగా గుర్తించి.. బంగారాన్ని పట్టుకున్నారు. అలాగే రూ.16.16లక్షల విదేశీ కరెన్సీని సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని అధికార వర్గాలు పేర్కొన్నాయి.