హైదరాబాద్ : జీడిమెట్లలో విద్యార్థి అదృశ్యం విషాదాంతమైంది. గాజులరామారం చింతల్ చెరువులో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఈ నెల 22న షాపూర్నగర్కు చెందిన సుమిత్ కుమార్(17) అదృశ్యమైన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు ఇష్టం లేని కోర్సులో చేర్పించారని సుమిత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
దీంతో సోమవారం ఇంట్లోనే తన ఫోన్ను వదిలేసి బయటకు వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రంతా అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. నిన్న చింతల్ చెరువు వద్ద సుమిత్ చెప్పులను కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.