హైదరాబాద్: నగరంలో బంజారాహిల్స్లో ఉన్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. బుధవారం రాత్రి బంజారాహిల్స్లోని పేకాట స్థావరాల్లో 17 మందిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.75 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. నిర్వాహకులు, జూదగాళ్లపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.