ఉత్తమ పనితీరుకు గుర్తింపు
సిటీబ్యూరో: పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది.బహుదుర్పుర ఠాణా హెడ్కానిస్టేబుల్ హెచ్. మధన్మోహన్, కార్ హెడ్ క్వార్టర్స్ హెడ్కానిస్టేబుల్ ఎం. సంజీవరెడ్డిలకు మహోన్నత సేవా పతకాలు, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న వారిలో 19 మందికి ఉత్తమ సేవా పతకాలు, 148 మందికి సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది.
అలాగే తెలంగాణ పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్న అడిషనల్ ఎస్పీ భూపాల్, డీఎస్పీ అమృత్రెడ్డి, ఏఆర్ ఎస్సై లింగయ్యకు ఉత్తమ సేవా పతకాలు దక్కాయి.