మల్కాజిగిరి, అక్టోబర్ 8: బీఆర్ఎస్తోనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కంటోన్మెంట్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. నేరేడ్మెట్ డివిజన్ మధురానగర్కాలనీ మైదానంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో సుమన్గౌడ్ ఆధ్వర్యంలో 150 మంది కాంగ్రెస్, బీజేపీ నేతలు మర్రి రాజశేఖర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదలు ఆర్థికంగా ఎదిగేందుకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నెలనెల పించన్లు అందజేస్తున్నారన్నారు. యువత స్వయం ఉపాధి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. దళతబంధు పథకంలో నియోజకవర్గానికి 100 మందికి చొప్పున ఒక్కొక్కరికీ రూ.10 లక్షల ఆర్థిక సాయం తో స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకంలో ఆడబిడ్డ పెండ్లి కోసం రూ.1,00,116 ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, బద్దం పరశురాంరెడ్డి, జేఏసీ వెంకన్న, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాసరావు, రమేశ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.