Accident | బంజారాహిల్స్, మార్చి 29: రోడ్డు ప్రమాదంలో 15 ఏండ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కిషన్బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ యాకూబ్ ఖాన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడి కుమారుడు మహ్మద్ ఇమ్రాన్ఖాన్ (15) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతడి ఇంటి పక్కన నివాసముంటున్న హలీముద్దీన్ ఏసీ మెకానిక్. గురువారం మధ్యాహ్నం మౌలాలిలో ఏసీ రిపేర్ కోసం హలీముద్దీన్ బయలుదేరుతున్న సమయంలో.. తనతో పాటు బైక్పై ఇమ్రాన్ ఖాన్ను కూడా తీసుకెళ్లాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత.. హలీముద్దీన్ తన బైక్ను ఇమ్రాన్కు ఇచ్చాడు.
బంజారాహిల్స్ రోడ్ నం. 1లో వెనుక నుంచి వచ్చిన ఓ బైక్.. ఇమ్రాన్ నడిపిస్తున్న బైక్ను ఓవర్టేక్ చేయడంతో ఆందోళనకు గురైన ఇమ్రాన్ బైక్ అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో బైక్ నడిపిస్తున్న ఇమ్రాన్కు తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని మహావీర్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. మైనర్ అయిన తన కొడుకుకు బైక్ ఇచ్చి ప్రమాదానికి కారణమైన హలీముద్దీన్పై చర్యలు తీసుకోవాలంటూ మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.