హైదరాబాద్ : ఢిల్లీలోని ఉత్తమ్నగర్లో ఎస్బీఐ పేరుతో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇది దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం అని ఆయన పేర్కొన్నారు. ఏడాదిలోనే దేశ వ్యాప్తంగా 33 వేల ఫోన్లు చేసి.. వందల కోట్ల రూపాయాలు మోసం చేశారని వెల్లడించారు. ఈ కేసులో 14 మందిని అరెస్టు చేశామన్నారు. ముఠా సభ్యుల నుంచి 30 సెల్ఫోన్లు, 3 ల్యాప్టాప్లు, కారు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. కాల్ సెంటర్ ముఠాపై దేశ వ్యాప్తంగా 209 కేసులు నమోదు అయినట్లు తెలిపారు.
ఎస్బీఐ ఏజెంట్ల నుంచి ఖాతాదారుల వివరాలు సేకరించి మోసాలకు పాల్పడినట్లు తేలింది. కాల్ సెంటర్ కేసులో ఫర్మాన్ హుస్సేన్ ప్రధాన నిందితుడు అని పేర్కొన్నారు. స్పూఫింగ్ అప్లికేషన్ల ద్వారా ఖాతాదారుల నగదు లూటీ చేస్తున్నట్లు తేలింది. 1860 180 1290 అనే నంబర్ నుంచి ఫోన్ చేస్తారు. అనంతరం కార్డుల వివరాలు సేకరించి డబ్బు కాజేస్తున్నారు అని సీపీ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు.