హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న 125 కిలోల గంజాయిని రాజేంద్రనగర్ (Rajendranagar) వద్ద పోలీసులు పట్టుకున్నారు. మత్తుమందును తరలిస్తున్న వారిని అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద పెద్దమొత్తంలో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ముత్తంగా టోల్ ప్లాజావద్ద ఆబ్కారి, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో ఓ కారులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో.. అధికారులు కారును తనిఖీచేశారు. అయితే వారు తప్పించుకోవడానికి ప్రయత్నించగా వెంబడించి ఇస్నాపూర్ వద్ద పట్టుకున్నారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 220 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.55 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితులు మహారాష్ట్రకు చెందినవారని, ఏపీ నుంచి మహారాష్ట్రకు మత్తుమందును తరలిస్తున్నారని తెలిపారు.