బాలానగర్, ఫిబ్రవరి 1 : కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. తెలంగాణలో ప్రజల కంటి సమస్యలను నివారించడం కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండోదఫా చేపట్టిన కంటి వెలుగు పథకం విశేష స్పందన లభిస్తున్నది. కూకట్పల్లి నియోజకవర్గంలో గత నెల 19 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని 15 కేంద్రాలలో కొనసాగిస్తున్నారు. కంటి వెలుగు పథకం బుధవారంతో 9వ రోజుకు చేరుకుంది. తొమ్మిది రోజులకు గాను 10283 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 5,224 మంది పరీక్షల అనంతరం రీడింగ్ గ్లాస్ తీసుకున్నారు. మరో 1852 మందికి కంటి అద్దాలు మరికొద్ది రోజులలో ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం కేపీహెచ్బీ రమ్యగ్రౌండ్ సెంటర్లో 105 మంది పరీక్షలు చేసుకున్నారు. కేపీహెచ్బీకాలనీ 4వ ఫేజ్ మినీ ఫంక్షన్హాల్లో 123 మంది పరీక్షలు చేసుకున్నారు.
ఫతేనగర్ భగత్సింగ్పార్క్ సెంటర్లో 100 మంది, బాలానగర్ వార్డు కార్యాలయం సెంటర్లో 150 మంది, ఇందిరానగర్ గుడిసెలలోని కమ్యూనిటీహాల్లో 100 మంది పరీక్షలు చేసుకున్నారు. బాగ్అమీర్ వార్డు కార్యాలయం సెంటర్లో 120 మంది, వెంకటేశ్వర్నగర్ సగర సంఘం హాల్ సెంటర్లో 124 మంది, హెచ్ఎంటీ హిల్స్ కమ్యూనిటీహాల్ సెంటర్లో 109మంది, రాంనరేశ్నగర్ కమ్యూనిటీహాల్లో 104 మంది. కూకట్పల్లి యూహెచ్సీ సెంటర్లో 107 మంది, హస్మత్ఫేట మోడల్ మార్కెట్ సెంటర్లో 121 మంది పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు, నోడల్ ఈఫీసర్లు ఆయా కేంద్రాలలలో పర్యటించి సిబ్బంది పనితీరును పరిశీలిస్తున్నారు.