కందుకూరు, డిసెంబర్ 25 : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణలో మనుగడ లేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గూడూరు గ్రామానికి చెందిన దాదాపు 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లుగా దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని తెలిపారు.
ప్రజలు ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన అనంతరం ఆ పార్టీలకు భయం పట్టుకున్నదన్నారు. పార్టీలో పని చేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. పార్టీలో ఐనవోలు మహేందర్రెడ్డి, మాజీ సర్పంచ్ జంగయ్య, శ్రీకాంత్రెడ్డితో పాటు పలువురు వార్డు సభ్యులు, నాయకులు చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, పార్టీ మండల అధ్యక్షుడు జయేందర్ ముదిరాజ్, మండల ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, లక్ష్మీనర్సింహా రెడ్డి, దశరథ ముదిరాజ్, సర్పంచ్లు భూపాల్రెడ్డి, శ్రీలత శ్రీహరి, నరేందర్గౌడ్, మేఘనాథ్రెడ్డి, అమరేందర్రెడ్డి, ఆనంద్, లచ్చానాయక్, పాండు, అలీ, బాబయ్య తదితరులు పాల్గొన్నారు.
పోరండ్ల గ్రామం నుంచి బీఆర్ఎస్లో చేరిక..
బడంగ్పేట, డిసెంబర్ 25 : మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
జిల్లెలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్పంచ్ శకుంతల మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మల్లేశ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యాదయ్య, అంజయ్య, నాగనందీశ్వర్రెడ్డి, నిఖిల్రెడ్డి, దేవేందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.