జవహర్నగర్, డిసెంబర్ 15: పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైంది. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్ కథనం ప్రకారం… జవహర్నగర్ కార్పొరేషన్లోని అంబేద్కర్నగర్ ఎన్టీఆర్కాలనీలో జీడల నరేశ్, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు.తన కుమార్తె ఇందు(10) దమ్మాయిగూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నది.
రోజువారీగా గురువారం ఉదయం నరేశ్ తన కూతురును పాఠశాలలో దింపి వెళ్లారు. సమయం ఉందని ఆడుకుంటానని స్నేహితులకు చెప్పి ఇందు బయటకు వెళ్లింది. ఈ క్రమంలో టీచర్ హాజరు తీసుకుంటుండగా ఇందు పేరు పిలువగా స్పందిచకపోవడంతో వెంటనే ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆమె ఆచూకీ కోసం చుట్టుప్రక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా సమాచారం లభించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.