Transgenders | ఎల్బీ నగర్, మార్చి 2 : సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పీ అండ్ టీ కాలనీ, కట్టకింద కల్లు కాంపౌండ్ ఏరియాను ట్రాన్స్జెండర్లు రెడ్ లైట్ ఏరియాగా మార్చేశారు. రాత్రి సమయాల్లో రోడ్లపై అబ్బాయిలను ఆకర్షిస్తూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు ట్రాన్స్జెండర్లు. స్థానికులు అందించిన సమాచారంతో.. శనివారం రాత్రి సరూర్నగర్ పీఎస్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య , ఎహెచ్టియు ఇన్స్పెక్టర్ దేవేందర్ తమ బృందాలతో నిఘా పెట్టి.. 10 మంది ట్రాన్సజెండర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద ఉన్న ఫోన్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించకుండా.. తదుపరి చర్యల నిమిత్తం సరూర్ నగర్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద హాజరు పరచి బైండోవర్ చేయడం జరుగుతుందని ఇన్స్పెక్టర్ సైది రెడ్డి తెలిపారు. ఇలా భయబ్రాంతులకు గురిచేస్తూ, అసాంఘిక కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మిర్యాలగూడ వాసి పొల్లోజు సింధు, పశ్చిమ బెంగాల్, కోల్కతా వాసులు తియాస్ (20), జూలీ, శంకర్ ప్రమాణ్క్(27), మహి ఘోష్ (26), సోనాబివాల్ (31), బుటియ్(27), దియా శంకర్ (27), అమృత బెయిల్ (26), పుణ్య బైరాగ్య(33), నూర్ మొహమ్మద్ (42) లను పోలీసులు అరెస్టు చేశారు. ట్రాన్స్జెండర్ల నుంచి నుండి 12 సెల్ఫోన్లు, 23 కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.