సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రజారోగ్యంపై జీహెచ్ఎంసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుకు 2 చొప్పున 300 వరకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 263 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయగా ఇంకా 37 బస్తీ దవాఖానల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
అందులో 20 దవాఖానలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మరో 17 దవాఖానలను సాధ్యమైనంత తొందరగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.